చంద్రబాబు భావోద్వేగం, వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం.
కరవు నేలపై నీటి ప్రవాహం పరుగులు పెట్టింది. దశాబ్ధాలుగా కలలు కన్న ఆ ప్రాంతం ఇక నీటి కటకట నుంచి బయటపడి, పచ్చని పంటలతో సస్యశ్యామలం కాబోతున్నది. కరవు కన్నీళ్ల స్థానంలో అక్కడ ఆనందభాష్పాలు విరిశాయి. ప్రజలు జలజల తరంగాలను తమ చేతితో స్పృసించి పరవశించిపోయారు. ఆ క్షణంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఆ భావోద్వేగాలను అక్షరాలతో పూరించడం అలవికాదు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని వెలిగొండ నీటి ప్రాజెక్టును సోమవారం […]






